బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైంది. షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత జరిగిన అత్యంత కీలకమైన సాధారణ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఏకపక్ష విజయం దిశగా దూసుకెళ్తోంది. శుక్రవారం ఉదయం వెలువడిన అనధికారిక ఫలితాల ప్రకారం.. 299 నియోజక వర్గాల్లో 204 చోట్ల కౌంటింగ్ పూర్తి అయింది. బీఎన్పీ ఇప్పటికే మెజారిటీ మార్కును దాటి సుమారు 158కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అలాగే జమాత్-ఇ-ఇస్లామీ 41 స్థానాలు గెలుచుకోగా, ఇతరులు ఐదు స్థానాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే.. ఆ దేశ తదుపరి ప్రధానిగా బీఎన్పీ అధినేత తారిక్ రెహమాన్ బాధ్యతలు స్వీకరిస్తారు.
తారిక్ రెహమాన్ అఖండ విజయం..
బీఎన్పీ అధినేత్రి ఖలీదా జియా మరణానంతరం పార్టీ పగ్గాలు చేపట్టిన ఆమె కుమారుడు తారిక్ రెహమాన్.. ఈ ఎన్నికల్లో రెండు చోట్ల (ఢాకా, బొగ్రా) పోటీ చేసి రెండింటిలోనూ భారీ మెజారిటీతో విజయం సాధించారు. దాదాపు 17 ఏళ్ల పాటు లండన్లో ఉన్న ఆయన.. గతేడాది డిసెంబర్లో స్వదేశానికి తిరిగి వచ్చారు. బీఎన్పీ ఇప్పటికే తారిక్ రెహమాన్ను తమ తదుపరి ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే తన గెలుపును ఉద్దేశించి తారిక్ రెహమాన్ మీడియో మాట్లాడుతూ.. ప్రజలు మార్పును కోరుకున్నారు. ఈ విజయం బంగ్లాదేశ్ భవిష్యత్తును మారుస్తుందంటూ కామెంట్లు చేశారు.
తారిక్ రెహమాన్ కాకపోయే నెక్ట్స్ పీఎం అతడే..
తారిక్ రెహమాన్ ప్రధాని రేసులో ముందున్నప్పటికీ.. ఆయనపై ఉన్న పాత క్రిమినల్ కేసులు, చట్టపరమైన చిక్కులు ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ఆయన బాధ్యతలు తీసుకోలేకపోతే.. అందుకు తగ్గట్లుగా బీఎన్పీ ప్లాన్ బీని కూడా సిద్ధం చేసుకుట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ సీనియర్ నేత, అనుభవజ్ఞుడైన మిర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ను ప్రధాని పదవికి ప్రత్యామ్నాయ అభ్యర్థిగా భావిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా పార్టీలో స్థిరత్వాన్ని కాపాడాలని బీఎన్పీ భావిస్తోంది.
ఈ ఎన్నికలతో పాటే రాజ్యాంగ సంస్కరణల కోసం 'జూలై నేషనల్ చార్టర్'పై రెఫరెండం కూడా నిర్వహించారు. ఇందులో ప్రధాని పదవికి గరిష్టంగా రెండు టర్ముల (10 ఏళ్లు) పరిమితి విధించడం, రెండు సభల పార్లమెంట్ ఏర్పాటు వంటి 84 అంశాల సంస్కరణల ప్యాకేజీ ఉంది. ఓటర్లు ఈ సంస్కరణలకు 'అవును' అని ఓటు వేస్తే.. కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ ఈ మార్పులను అమలు చేయాల్సి ఉంటుంది. హసీనా హయాంలో ఉన్న ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలకడమే ఈ చార్టర్ ప్రధాన ఉద్దేశం.
బంగ్లాదేశ్లో బీఎన్పీ అధికారంలోకి రావడం భారత్తో సంబంధాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో బీఎన్పీ పాలనలో భారత్ వ్యతిరేక శక్తులకు మద్దతు లభించిందనే విమర్శలు ఉన్నాయి. అయితే తాజాగా తారిక్ రెహమాన్ తన ప్రసంగాల్లో శాంతి, స్థిరత్వం గురించి మాట్లాడుతున్నారు. మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడే కొత్త ప్రభుత్వం పొరుగు దేశాలతో ఎటువంటి సంబంధాలను కొనసాగిస్తుందనేది చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa