ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిమాండ్స్ నెరవేరకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 24, 2026, 02:15 PM

కర్నూలు నగరంలో దీక్షా శిబిరంలో సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు మంగళవారం రెండో రోజు మాట్లాడుతూ, అంగన్వాడీల వేతన పెంపు, గ్రాట్యుటీ, పీఎఫ్-ఈఎస్ఐ, సూపర్వైజర్ పోస్టుల భర్తీ, మినీ సెంటర్లను మైన్ సెంటర్లుగా మార్చడం, వేసవి సెలవులు వంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ నిర్మల, జిల్లా కోశాధికారి గోపాల్, నగర అధ్యక్ష కార్యదర్శులు నగేష్, నరసింహులు, ఏఐటీయూసీ నగర అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్, వెంకటేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa