నీటి కరువుతో తమిళనాడు తల్లడిల్లుతోంది. జూన్ నెల చివరివరకు వస్తున్నప్పటికి తమిళనాడులో నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రిజర్వాయర్లు ఎండిపోయి చుక్కనీటి కోసం ట్యాంకర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. లాటరీల పద్దతిలో బిందె నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. నీటి ట్యాంకర్ల దగ్గర యుద్దాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ విషయంపై హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియో స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో బావి దగ్గర నీటి కోసం చూస్తున్న మహిళల ఫోటోను పోస్ట్ చేసిన డికాప్రియో చెన్నై సమస్యపై సుధీర్ఘ కామెంట్ చేశారు. "చెన్నైని ఇక వర్షాలు మాత్రమే కాపాడగలవు. నీటి వనరులు ఎండి పోయాయి..ఒక మహానగరం నీరు లేక అలమటిస్తోంది. నాలుగు ప్రధాన రిజర్వాయర్లు ఎండోపోవటంతో చెన్నై తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. అధికారులు తాత్కాలిక ఉపశమనం కోసం సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. నీటి కోసం ట్యాంకర్త వద్ద గంటల తరబడి క్యూలల్లో నిలబడాల్సి వస్తోంది. నీటి ఎద్దడి తట్టుకోలేక అనేక హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేశారు. ఒక పక్క అధికారులు సమస్య నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నిస్తుండగా మరోపక్క నగర వాసులు వానల కోసం భగవంతుడికి మొరపెట్టుకుంటున్నారు." అంటూ సోషల్ మీడియా ద్వారా తను ఆవేదనను వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa