ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయనిర్మల మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటు: బాలకృష్ణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 27, 2019, 12:16 PM

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మృతి పట్ల సినీటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు. విజయనిర్మల మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటన్నారు. నటి, దర్శకురాలు, నిర్మాతగా తనదైన ప్రత్యేకత సంపాదించుకున్నారని పేర్కొన్నారు. బాలనటి నుంచి ఎన్నో గొప్ప చిత్రాల్లో విజయనిర్మల నటించారన్నారు. ఎన్టీఆర్‌తో మారిన మనిషి, పెత్తందార్లు, విచిత్రకుటుంబం సినిమాల్లో నటించారని ఆయన గుర్తు చేశారు. 44 చిత్రాలకు దర్శకత్వం చేయడం చాలా గొప్ప విషయమన్నారు. దర్శకురాలిగా గిన్నిస్‌ బుక్‌ రికార్డు సాధించి మహిళలకు ఆదర్శంగా నిలిచారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa