ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక‌పై జమ్ముకశ్మీర్‌ లో వీరుల పేర్లు!అమిత్ షా

national |  Suryaa Desk  | Published : Thu, Jun 27, 2019, 09:15 PM

వీర మరణం పొందిన పోలీసుల పేర్లను రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలకు పెట్టాలని అమిత్ షా ఆదేశించారు. ఉగ్రవాదంపై పోరాటంలో అమరవీరులకు సముచిత స్థానం ఇవ్వాలని, ఉగ్రవాదాన్ని ఏ మాత్రం ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా.. భద్రతా బలగాలకు సూచించారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌ పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడి ఉన్నతాధికారులతో భద్రతపై సమీక్ష నిర్వహించారు. ఇందులో గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు షా జారీ చేసిన ఆదేశాల గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం మీడియాకు వివరించారు. ఉగ్రవాదాన్ని అణచివేయడం కోసం జమ్ముకశ్మీర్‌ పోలీసులు తీసుకుంటున్న చర్యలను షా ఈ సందర్భంగా ప్రశంసించారు.
ఉగ్రవాదాన్ని ఏ మాత్రం ఉపేక్షించొద్దు. ఉగ్రవాదానికి అందుతున్న నిధుల విషయంలో తీసుకుంటున్న కఠిన చర్యలను కొనసాగించాలని అమిత్‌ షా ఆదేశించినట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు. అమర్‌నాథ్‌ యాత్ర నేపథ్యంలో భద్రత ఏర్పాట్లపై ప్రధానంగా సమీక్ష జరిగింది. గతసారి కన్నా ఈ ఏడాది భద్రతను మరింత పెంచారు. యాత్రకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా పరిపాలన విభాగం చేస్తున్న ఏర్పాట్లతో పాటు ఇతర ఏర్పాట్లపై షా చర్చించారు. యాత్రికుల భద్రత కోసం భద్రతా బలగాలు ఆధునాతన సాంకేతికను వినియోగించుకోవాలని, భక్తుల సమాచారాన్ని కూడా తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగించాలని చెప్పారు అని ఆయన తెలిపారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa