శ్రీశైలం : శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 29 నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు నిర్వహిస్తామని ఆలయ కార్య నిర్వహణాధికారి కేఎస్ రామారావు తెలిపారు. దసరా మహోత్సవాల ఆహ్వాన పత్రికను ఆయన ఆదివారం విడుదల చేశారు. ఉత్సవాల సందర్భంగా మల్లికార్జున స్వామివారికి విశేష అర్చనలు, భ్రమరాంబదేవికి ప్రత్యేక నవావరణ పూజలు నిర్వహిస్తామని తెలిపారు. దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి నవదుర్గ అలంకరణలు, స్వామి అమ్మవార్లకు వాహనసేవలు నిర్వహిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa