తిరుమల: తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సేవలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ అధికారులు ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం 11 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమం కొనసాగనుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో శ్రీవారికి అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేశారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 8 వరకు శ్రీవారి వార్షిక బ్రహోత్సవాలు జరగనున్నాయి. 30న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి.
- ఈ నెల 30న రాత్రి పెదశేష వాహనంపై స్వామివారి ఊరేగింపు
- వచ్చే నెల 1న చినశేష, హంస వాహనంపై ఊరేగింపు
- 2వ తేదీన స్వామివారికి సింహ, ముత్యపు పందిరి వాహన సేవలు
- 3వ తేదీన కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవలు
- 4వ తేదీన హోహిని అవతారం, గరుడ వాహన సేవలు
- 5వ తేదీన హనుమంత, గజవాహన సేవలు
- 6వ తేదీన సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు
- 7వ తేదీన రథోత్సవం, అశ్వవాహన సేవ
- 8వ తేదీన జరిగే చక్రస్నానంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa