ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్పై విశాఖ ఎయిర్పోర్టులో కోడి కత్తితో దాడి చేసిన ఘటనలో నిందితుడు జనిపల్లి శ్రీనుకు ప్రాణహాని ఉందని ఆతని బంధుగణం ఆరోపిస్తోంది.
ఈమేరకు అతని సోదరుడు జనిపల్లి సుబ్బరాజు, న్యాయవాది అబ్దుల్ సలీమ్ తో కలిసి సెంట్రల్ జైలు వార్డర్, జైలర్లపై తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వన్టౌన్ పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదులో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉంటున్న తన సోదరుడు శ్రీనును జైలర్, వార్డెన్ వేధిస్తున్నారని, పదే పదే ఆత్మహత్య చేసుకోవాలని సూచిస్తూ, ఆదిశగా ఆతనిని ప్రేరేపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా న్యాయవాది మాట్లాడుతూ ఈ కేసులో ఫిర్యాదుదారుడు సాక్షాత్తు సీఎం కావడం వల్ల ఈ కేసును తెలంగాణకు బదిలేయాలని ప్రభుత్వం తరపున వార్తలొస్తున్నాయని, అక్కడ కూడా సరైన న్యాయం జరిగే ఆస్కారం లేదని, అందుకే కేరళకు గానీ, బెంగాల్కు గానీ బదలాయించాలని కోరుతున్నామన్నారు. లేని పక్షంలో కోడికత్తి శీను కథ మరో మొద్దుశీను కథలా ముగించే ఆస్కారం ఉందని ఆందోళన చెందుతున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa