ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రివర్స్ టెండరింగ్ లపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 25, 2019, 04:15 PM

రివర్స్ టెండరింగ్ ల పై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన వైసీపీ ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తుందన్నారు. ఆయన ఏమన్నారంటే…


"పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్ ద్వాారా 782 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశాం. ఏ రాష్ట్రంలో కూడా రివర్స్ టెండరింగ్, జ్యూడిషియల్ ప్రివ్యూ లేవు. 100 కోట్లు దాటిన ఏ టెండర్ నైనా జడ్జి దృష్టికి తీసుకెళుతున్నాం. పీపీఏల విషయంలో విప్లవాత్మక విధానాలు అమలు చేస్తున్నాం. డిస్కంల పై 20 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. 13 నెలలుగా బకాయిలు చెల్లించలేదు. మేం అధికారంలోకి రాగానే సమీక్ష నిర్వహిస్తే ఈ విషయం తేలింది. పీపీఏ ల పై సమీక్ష చేయకపోతే డిస్కంలు బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు. ఏపీలో కరెంట్ ఛార్జీలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకే పారిశ్రామిక వేత్తలు రావడానికి మొగ్గు చూపడం లేదు. దీనిని సరి చేస్తాం. విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాం." అని సీఎం జగన్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa