మిషన్ అంత్యోదయ మరియు పీపుల్స్ క్యాంపెయిన్ కు సంబంధించి అక్టోబరు 4వతేది మరియు 5వ తేదీల్లో జిల్లా, డివిజన్ స్థాయిల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సిఎస్ తెలిపారు. అలాగే అక్టోబరు 10 మరియు 11వ తేదీల్లో మండల స్థాయిలో పంచాయితీ కార్యదర్శులు, విలేజి వాలంటీర్లు, ఎఎన్ఎం, అంగన్వాడీ వర్కర్లు, విఏఓ, ఎంపిఇఓలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. తదుపరి అక్టోబరు 15నుండి 18 వరకూ మిషన్ అంత్యోదయ సర్వే పూర్తిచేయాల్సి ఉంటుందని తెలిపారు. అనతంరం అక్టోబరు 22 నుండి 24 వరకూ మిషన్ అంత్యోదయ సర్వేపై ప్రత్యేక గ్రామ సభలను నిర్వహించాల్సి ఉంటుందని సిఎస్ స్పష్టం చేశారు. నవంబరు 1వతేదీ నుండి 15వతేదీ వరకూ అన్ని లైన్ డిపార్టుమెంట్ ల భాగస్వామ్యంతో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుందని తెలిపారు. తదుపరి నవంబరు 18నుండి 23 వరకూ గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళిక ఆమోదానికై గ్రామ సభలను నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం నవంబరు 18నుండి 30 వరకూ గ్రామ సభ డేటాను గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళిక మొబైల్ యాప్ లో పొటోలతో పాటు అప్ లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.తదుపరి డిశంబరు 2 నుండి 10వతేదీ వరకూ ఆమోదించిన గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళికను ఢిల్లీ లోని ఎన్ఐసి ప్లాన్ ప్లస్ అప్లికేషన్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని సిఎస్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళిక ప్లాన్ ప్రక్రియ అంతా పటిష్టంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈ మేరకు సంబంధిత శాఖల జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కలక్టర్లు అందరికీ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్టు సిఎస్ చెప్పారు. జిల్లా పరిషత్ కు సంబంధించి జడ్పి సిఇఓ, పంచాయితీరాజ్ యాక్టివిటీలకు సంబంధించి డిపిఓ, ఉపాధిహామీ మరియు గ్రామీణాభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి డ్వామా పిడి నోడలు అధికారిగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలకు సంబంధించి పిడిడిఆర్డిఏ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సంబంధిత జిల్లా అధికారులు జిల్లాలో విస్తృతంగా జిల్లాల్లో పర్యటించి ఈ కార్యక్రమం విజయవంతంగా అమలు జరిగేలా చూడాలని సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. పంచాయితీరాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మిషన్ అంత్యోదయ సర్వే మరియు గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa