విజన్ ఇండియా@2022 కింద పేదరికం లేని భారతదేశంగా ప్రకటించే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా మిషన్ అంత్యోదయ సర్వే కింద గ్రామ పంచాయితీలకు సంబంధించి 29 అంశాలకు చెందిన పారామీటర్ల ఆధారంగా గ్రామ పంచాయితీల్లో గ్యాప్ లను భర్తీచేసేందుకు వీలుగా ఈసర్వే చేపట్టాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ముఖ్యంగా 29 అంశాలు అనగా వ్యవసాయం, భూమి అభివృద్ధి, మైనర్ ఇరిగేషన్, పశు సంవర్ధన, మత్స్య, సామాజిక అడవులు, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, చిన్నతరహా పరిశ్రమలు, ఖాదీ విలేజ్ మరియు కాటేజి ఇండస్ట్రీస్, గ్రామీణ గృహాలు, తాగునీరు, ఇంధనం, పశుగ్రాసం, రహదార్లు, గ్రామీణ విద్యుద్దీకరణ, సాంప్రదాయేతర ఇంధన వనరులు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, విద్య, ఒకేషనల్ విద్య, వయోజన విద్య మరియు నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, లైబ్రరీలు, సాంస్కృతి కార్యక్రమాలు, మార్కెట్లు మరియు ఫెయిర్స్, ఆరోగ్యం-పరిశుభ్రత, కుటుంబ సంక్షేమం, మహిళా శిశు అభివృద్ధి, సాంఘిక సంక్షేమం, బలహీన వర్గాల సంక్షేమం, ప్రజా పంపిణీ విధానం, సామాజిక ఆస్థుల నిర్వహణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుందని సిఎస్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa