తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం పైకి గరుడ ధ్వజపటాన్ని అధిష్టింపజేస్తారు. శ్రీమహావిష్ణువుకు ప్రధాన వాహనమైన గరుత్మంతుడు స్వయంగా నింగికెగసి అష్టదిక్పాలకులు సహా దేవతలందరినీ ఆహ్వానించే ప్రక్రియే ధ్వజారోహణం. తిరుచ్చిలో ఉత్సవర్లతో పాటు అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి, ధ్వజపటాలను మధ్యాహ్నం 3-5గంటల మధ్య మాడవీధుల్లో ప్రదక్షిణగా ఊరేగించి ఆలయానికి వేంచేపు చేస్తారు. సాయంత్రం 5.23- 6గంటల మధ్య మీన లగ్న శుభముహూర్తంలో ధ్వజారోహణను వేడుకగా నిర్వహిస్తారు. రాత్రి 8గంటలకు జరిగే పెద్దశేష వాహనసేవ మొదలుకొని 7న రాత్రి అశ్వవాహనం వరకు తిరువీధి ఉత్సవాలు కనులపండువగా కొనసాగుతాయి. 8న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa