మన ఇంట్లో సాధారణంగా ఎక్కువగా చేసే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. దీనిని ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఇడ్లీని బాగా ఆస్వాదిస్తారు. చాలా మంది దీనిని ఉదయం లేదా సాయంత్రం పూట చేసుకుని తింటుంటారు. సాంబార్, కొబ్బరి చట్నీతో ఇడ్లీ తింటే ఆ టేస్టే వేరు. అంతేకాకుండా ఈ రోజుల్లో రకరకాల ఇడ్లీ వెరైటీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రాగి ఇడ్లీ, ఓట్స్ ఇడ్లీ, వెజిటెబుల్ ఇడ్లీ ఇలా డిఫరెంట్ పేర్లతో అందుబాటులో ఉన్నాయి.
అయితే, ఇంట్లోని ప్రతి ఒక్కరూ హోటల్ స్టైల్ ఇడ్లీలను కోరుకుంటారు. తెల్లగా, మెత్తగా, మృదువుగా ఉండాలని భావిస్తారు. అయితే, కొన్ని సార్లు ఇంట్లో ఇడ్లీలు బాగా మెత్తగా రావడం లేదా గట్టిగా రావడం జరుగుతుంది. దీంతో, ఇంట్లో అందరు డిస్పాయింట్ అవుతారు. అంతేకాకుండా ఇడ్లీ తినడానికి ఆసక్తి చూపించరు.
ఎంత కష్టపడ్డా ఇడ్లీ సరిగ్గా రాకపోతే చాలా బాధనిపిస్తుంది. అయితే, కొన్ని చిట్కాలు పాటిస్తే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా, మృదువుగా వస్తాయి. అంతేకాకుండా ఇడ్లీలు కోసం బియ్యం, మినపప్పును ఎంతసేపు నానబెట్టాలో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. పర్ఫెక్ట్ ఇడ్లీ ఎలా చేయాలో తర్లా దలాల్ యూట్యూబ్ ఛానెల్లో చెప్పారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
సాధారణ బియ్యం - రెండు గిన్నెలు
మినపప్పు - అర గిన్నె
మెంతులు - 1/2 స్పూన్
అటుకులు - మూడు చెంచాలు
సరైన కొలతలు చాలా ముఖ్యం
ప్రతి 2 గిన్నెల బియ్యానికి, ½ గిన్నె మినపప్పు, ½ టీస్పూన్ మెంతులు వాడండి. ఇడ్లీ మెత్తగా, మృదువుగా రావాలంటే సరైన నిష్పత్తి చాలా ముఖ్యం. అదే మీరు మూడు కప్పుల బియ్యం ఉపయోగిస్తే.. ఒక కప్పు మినపప్పు వాడండి. ఇక, అటుకులు కూడా చాలా ముఖ్యం.
అటుకులు వాడటం వల్ల ఇడ్లీలు మృదువుగా, సాఫ్ట్గా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని నానబెట్టేముందు బాగా వాష్ చేసుకోవాలి. బియ్యం, మినపప్పును బాగా కడిగిన తర్వాత నానబెట్టాలి.
ఇడ్లీ ప్రాసెస్ విధానంపై ఓ లుక్కేయండి
ఎంతసేపు నానబెట్టాలి?
అన్ని పదార్థాలను బాగా కడిగి, నీటిలో 4–5 గంటలు నానబెట్టండి. నానబెట్టడం వల్ల కలిగే మొదటి స్పష్టమైన ప్రభావం ఏమిటంటే బియ్యం, మినపప్పు నీటిని పీల్చుకుని ఉబ్బుతాయి. దీని కారణంగా, అవి మృదువుగా మారతాయి.
దీంతో వాటిని రుబ్బుకోవడం లేదా మిక్సీ పట్టడం సులభం అవుతుంది. సరిగ్గా నానబెట్టడం వల్ల రుబ్బిన తర్వాత కిణ్వ ప్రక్రియ బాగా జరుగుతుంది. అంటే పిండి సరిగ్గా పులవడం జరుగుతుంది. దీని కోసం పిండిలో ఉప్పు వేసి రాత్రంతా పక్కన పెట్టుకోండి.
గ్రైండింగ్ లేదా మిక్సీ ఎలా పట్టుకోవాలి?
మొదట మినపప్పు, మెంతులు కలిపి కొద్దిగా నీరు పోసి రుబ్బుకోవాలి . ఆ తర్వాత బియ్యం, అటుకుల్ని వేసి మెత్తగా అయ్యే వరకు బాగా రుబ్బుకోవాలి. పిండి మీడియం సాంద్రతతో ఉండాలి. మరి మందంగా అంటే చిక్కగా లేదంటే నీళ్లగా ఉండకూడదు. ఇప్పుడు మినప పిండి, బియ్యం పిండిని వేసుకుని బాగా కలుపుకోండి.
పిండిని ఒక పెద్ద కంటైనర్లో పోసి దానిని కప్పి, 8-10 గంటలు వెచ్చని ప్రదేశంలో ఉంచండి. వెడల్పాటి లోతైన గిన్నెలో వేడి నీళ్లు పోయండి. అందులో ఇడ్లీ పిండి గిన్నెను ఉంచి పైన మూత పెడితే పిండి బాగా పొంగుతుంది. ఇలాంటి పిండితో ఇడ్లీలు మృదువుగా వస్తాయి. మీరు రవ్వ ఇడ్లీ కావాలనుకుంటే .. నానబెట్టిన ఇడ్లీ రవ్వను మినప పిండిలో కలుపుకోవచ్చు.
ఇడ్లీలు ఎలా పెట్టాలి?
ఇడ్లీ మూతలపై ముందుగా తేలికగా నూనె లేదా నెయ్యి అప్లై చేయండి.
పిండిని కలిపిన తర్వాత మీకు కావాల్సిన పరిమాణంలో ఇడ్లీ మూతలపై గరిటెతో నింపండి.
ఇడ్లీ కుక్కర్లో నీటిని వేడి చేయండి. ఇడ్లీ మూతల్ని 10–12 నిమిషాలు అధిక వేడి మీద ఆవిరి మీద ఉంచండి.
టూత్ పిక్ సాయంతో ఇడ్లీలు బాగా ఉడికాయో లేదో చెక్ చేయండి.
2 నిమిషాల తర్వాత చల్లబరిచి ఇడ్లీలను పాత్రలోకి తీసుకోండి.
వేడి వేడి సాంబార్ లేదా కొబ్బరి చట్నీతో ఇడ్లీల్ని సర్వ్ చేయండి.
ఈ చిట్కాలతో ఇంట్లో హోటల్ స్టైల్ ఇడ్లీలు తయారు చేయవచ్చని నిపుణులు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa