శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల కల్యాణవేదికలో ఏర్పాటు చేసిన శ్రీవారి బ్రహ్మోత్సవ మహాప్రదర్శనను సోమవారం టిటిడి అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి టిటిడి ఛైర్మెన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఛైర్మెన్ మాట్లాడుతూ శ్రీవారి భక్తులను ఆకట్టుకునేలా మహాప్రదర్శనను ఏర్పాటు చేశారని తెలిపారు. భక్తులను ఆకర్షించేలా కల్యాణవేదికలో టిటిడి ఎస్వీ మ్యూజియం విభాగం, ప్రజాసంబంధాల విభాగం, ఉద్యానవన శాఖ, అటవీవిభాగం, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో మహాప్రదర్శనను రూపొందించారన్నారు. శ్రీ అత్తి వరదరాజస్వామివారి తరహాలో మూడు భంగిమల్లో సెట్టింగ్ ఏర్పాటు చేయడం, కంచికి వెళ్లి చూసినట్లు ఉందన్నారు. అదేవిధంగా, నాలుగు యుగాలకు సంబంధించిన పౌరాణిక ఘట్టాలతో భక్తిభావాన్ని పంచేలా దేవతామూర్తులను రూపకల్పన చేశారని అన్నారు. బ్రహ్మోత్సవాలలో దాదాపు 40 టన్నుల పుష్పాలు, 2 లక్షల కట్ ఫ్లవర్లను వినియోగించనున్నారని తెలిపారు. ఫలపుష్పాలతో ఏర్పాటు చేసిన ఏనుగులు, కలశాలు, గుర్రాలు, రథం తదితర ఆకృతులను తిలకించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa