ఏపీ సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్పందన కార్యక్రమం పై సమీక్షలో భాగంగా కలెక్టర్లు,ఎస్పీలు, ఇతర అధికారులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తక్షణమే ఇసుక కొరతను తీర్చాలన్నారు. ఇసుక రవాణా చేయడానికి ప్రభుత్వం నిర్దేశించిన ధరకు ఎవరు ముందుకు వచ్చినా వారికి బాధ్యత అప్పగించాలన్నారు. కిలోమీటర్ కు రూ.4.90 చొప్పున ప్రభుత్వ చార్జీ కేటాయించామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక రవాణాలో అక్రమాలు జరగవద్దన్నారు. రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్ లను ఓపెన్ చేసి ఇసుక సరఫరా చేయాలన్నారు. ప్రస్తుతం వరదలు తగ్గాయని, ఇసుక లభ్యత పుష్కలంగా ఉందన్నారు. వినియోగదారులకు కూడా తక్కువ ధరకే ఇసుకను విక్రయించాలన్నారు. రెండు నెలల్లో పూర్తిగా మార్పులు జరగాలని, గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి తేడా కనిపించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఇసుక రవాణా కాంట్రాక్టులు నిరుద్యోగులైన ఎస్సీ,ఎస్టీ,బీసీలకు చెందిన యువకులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక మాఫియా రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదన్నారు. ఇసుక మాఫియా కంటికి కూడా కనిపించవద్దని సీఎం జగన్ కఠిన ఆదేశాలిచ్చారు. ఈ విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్చనిస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇసుక ఎగుమతులు ఉండకూడదని, రాజకీయ జోక్యాన్ని కూడా అనుమతించవద్దని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇసుక విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎక్కడ అక్రమాలు జరిగినా, అవినీతి జరిగినా సహించనని అధికారులను జగన్ హెచ్చరించారు. ఇసుక విధానం పై మాట్లాడుతున్నంత సేపు సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa