ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ లోని పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2019, 05:09 PM

రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. గుంటూరు, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల, బెల్లంకొండ మండలాలు, కర్నూలు జిల్లాలో రుద్రవరం, ఆళ్లగడ్డ, దోర్నిపాడు మండలాలు, విజయనగరం జిల్లాలో విజయనగరం, గజపతినగరం, గుర్ల, నెల్లిమర్ల, గంట్యాడ, పార్వతీపురం, మక్కున, సాలూరు, బొండపల్లి మండలాలకు పిడుగుపాటు హెచ్చరికలు చేశారు. ఈ మండలాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa