ఆంధ్రప్రదేశ్ ను అనాధ రాష్ట్రంగా మార్చారని, మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. విజయవాడలో శుక్రవారం టీడీపీ కార్యకర్తలు నిరసన దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత బొండా ఉమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక పేద ప్రజల నష్టపోతున్నారని. భవన నిర్మాణ కార్మికులు పనిలేక కష్టాలు పడుతున్నారని అన్నారు.
ఇసుక మీద ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై నిరసన దీక్ష చేపట్టామని ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేవరకూ టీడీపీ పోరాటం చేస్తుందని ఉమా అన్నారు. ప్రజలను కష్టాలపాలు చేస్తూ టీడీపీ కార్యకర్తలపైన కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఐదు నెలల్లో తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు కోలుకోలేని దెబ్బతిన్నారని బోండా ఉమా మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa