ఆంధ్రప్రదేశ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న సీఎం జగన్ ఇప్పుడు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ సేవలను హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాలకూ వర్తింప జేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు నగరాల్లో ఏపీలోని ప్రతి సామాన్యుడికి పలు సూపర్ స్పెషాలిటీ సేవలు పొందేందుకు వీలుగా వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని పొడిగిస్తునట్టుగా.. వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ప్రకటించారు. అవయవమార్పిడి ఆపరేషన్లు, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, పీడీయాట్రిక్ సర్జరీలతో సహా 17 అంశాల్లో 716 వైద్య చికిత్సలకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసింది. అంతే కాకుండా ఈ మహానగరాల్లో ఉన్న ఆసుపత్రులలో మెరుగైన చికిత్స పొందేందుకు పేరెన్నికగన్న ఆస్పత్రులను గుర్తించి ఎంప్యానల్ చేసేందుకు వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ట్రస్టుకు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa