గత కొద్దీ రోజుల నుండి మహారాష్ట్రలో కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలో వరద ఉదృతంగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి పైనుండి భారీగా వరద వస్తున్నందున అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. దాంతో ప్రాజెక్ట్ చుట్టుపక్కల ప్రాంతాల వారు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, కాకతీయ కెనాల్, ఫ్లడ్ ఫ్లో కెనాల్ పరివాహక ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాటి దరిదాపులకు వెళ్లవద్దని, రైతులు, మత్స్యకారులు, పర్యాటకులు ప్రాజెక్టులోకి దిగకూడదని, ఈతకు వెళ్లవద్దని యువత సాహసాలు చేయకూడదని, సెల్ఫీలకు ప్రయత్నించవద్దని పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం ఆర్ ఎం రావు ఒక ప్రకటనలో తెలిపారు. పిల్లలను, మేకలు, గొర్రెలను, పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీసు, నీటిపారుదల శాఖల అధికారులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండి ప్రజలు ఇబ్బందులు పడకుండా, ప్రమాదాలకు గురికాకుండా అవసరమైన ముందస్తు హెచ్చరికలు చేయాలని, ముందు జాగ్రత్తలు సూచించాలని ఆయన ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa