తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబరు 23 నుంచి డిసెంబరు 1వతేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశం మందిరంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగా ఆలయ పరిసరాలలో చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు తదితర ఇంజినీరింగ్ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. నవంబరు 30న రథోత్సవం సందర్భంగా మహా రథాన్ని శుభ్రపరిచి, బ్రేక్లు, తదితర మరమ్మత్తు పనులను పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ రోజులైన నవంబరు 27న గజవాహనం, నవంబరు 28న బంగారు రథం, గరుడవాహనం, డిసెంబరు 1న పంచమితీర్థం నాడు రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇంజినీరింగ్, పోలీస్, ట్రాఫిక్, విజిలెన్స్ అధికారులు సమయ్వయంతో వాహనాల పార్కింగ్కు గత ఏడాది కంటే అదనపు పార్కింగ్ స్థలాలను ముందస్తుగా గుర్తించి, ఏర్పాటు చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa