ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తోటను అమ్మవద్దన్నందుకు.. భార్యను హత్య చేసిన భర్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 09, 2019, 12:33 PM

మామిడి తోటను అమ్మవద్దన్న పాపాననికి భార్యను ఓ కసాయి భర్త అత్యంత దారుణంగా నరికి చంపేశాడు. కడప జిల్లా రాయచోటి పట్టణంలోని కొత్తపేట చైతన్య స్కూల్ సమీపంలో ఈ దారుణం చోటు చేసుకుంది. రాత్రి 12.20 గంటల సమయంలో ఖాదర్ వలి (46) అనే వ్యక్తి తన భార్య నూర్జహాన్‌కు లక్కిరెడ్డిపల్లి మండలం మద్దిరేవుల రెడ్డివారిపల్లి గ్రామంలోని తమ మామిడి తోట అమ్మే విషయంలో వాగ్వాదం నడిచింది.


నూర్జహాన్‌తో పాటు కుమారుడు మహ్మద్ రఫీ కూడా మామిడి తోటను అమ్మేందుకు అంగీకరించలేదు. దీంతో ఆగ్రహించిన ఖాదర్‌వలి.. కొడవలితో భార్యను తల పైన నరికి చంపేశాడు. అడ్డుకోబోయిన కొడుకు మహమ్మద్ రఫీని కూడా చంపేందుకు ప్రయత్నించగా అతను తప్పించుకుని స్వల్ప గాయంతో బయటపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ రాజు తన సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకొని జరిగిన సంఘటనపై ఆరా తీసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa