కొన్ని ఏళ్ల నుండి అలానే వున్న రామ జన్మభూమి- బాబ్రీ మసీద్ కి సంబందించిన వివాదాస్పద స్థలానికి సంబందించిన తుది తీర్పు ఈరోజు (శనివారం) వెలువడింది. అయితే శనివారం ఈరోజు సెలవు దినం అయినప్పటికీ తీర్పు వెల్లడించడానికి కొన్ని కారణాలు వున్నాయి. ముఖ్యమైన కొన్ని కేసుల్ని సెలవు దినం లో కూడా న్యాయస్థానం తీర్పులు వెలువరించవచ్చు. అయితే అక్టోబర్ 16 నాటికీ ఈ కేసుకి సంబంధించి విచారణ పూర్తీ చేసిన సుప్రీం కోర్ట్ తీర్పుని పెండింగ్ లో ఉంచింది. అయితే సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ 17 న పదవి విరమణ చేయనున్నారు. ఆలోగా తీర్పు వస్తుందని అందరు భావించారు. అయితే రంజాన్ గొగోయ్ పదవి విరమణ చేసేది ఆదివారం, అంతకు ముందు రోజు శనివారం. అందరు 15 వ తేదీన తీర్పు ఉంటుందని భావించారు. కానీ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ సుప్రీం కోర్ట్ ఉదయం 10:30 గంటలకు తీర్పు వెలువడించనుంది అని అధికారిక వెబ్సైటు లో ప్రకటించి షాక్ ఇచ్చింది. విద్వేషాలను, భావోద్వేగ, విశ్వాసాల్ని, సామజిక అంశాలను అరికట్టే దిశగా ఈ ఆకస్మిక నిర్ణయం ఉందని అందరు భావిస్తున్నారు. అంతే కాకుండా తీర్పు వెలువడినాక దీనిపై సమీక్ష నిర్వహించే అవకాశం కూడా వుంది. దీనికి సమయం మరొక రెండు మూడు రోజులు పెట్టె అవకాశం వుంది. అంతే కాకుండా ఈ విషయాలన్నింటిని న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంటుంది. అందుకే సుప్రీమ్ కోర్ట్ జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పు ని శనివారం వెల్లడించినట్లు తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa