ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు దిశగా అడుగులుపడుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. అదే నిజమయితే రద్దుకావటం ఇది రెండోసారి అవుతుంది. శాసనమండలి మొట్టమొదటగా 1958 జులై 1వ తేదీన ఏర్పడింది. 1983లో అధికారం చేపట్టిన ఎన్ టి రామారావు ఆధ్వర్యంలోని తెలుగుదేశం శాసన మండలి రద్దుపై సిఫారసు చేచేయగా 1985 లో శాసన మండలి రద్దయ్యింది. ఆ తర్వాత 22 సంవత్సరాలు శాసన సభ ఒక్కటే వుంది. తదుపరి అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి దీనిని రాజకీయ అవసరాల కోసం పలువురికి పదవులు అందించాల్సిన క్రమంలో పునరుద్ధరించేందుకు నిర్ణయించగా 2007 మార్చి 30వ తేదీన శాసన మండలి తిరిగి ఏర్పడింది.
కాగా విభజిత ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం శాసన మండలి లో టీడీపీ మెజారిటీ లో వుంది. మొత్తం 58 స్థానాలకు గాను టీడీపీ కి 26 , వైస్సార్సీపీ కి 9 , పిడిఎఫ్ కి 5 , బీజేపీ కి 3 , స్వతంత్రులు 4 , నామినేటెడ్ 8 మంది వున్నారు. మూడు స్థానాలు ఖాళీగా వున్నాయి. తాజాగా శాసనసభ లో ఆమోదం పొందుతున్న పలు బిల్లులను కౌన్సిల్ లో ఆమోదించక పోవటమో, తిప్పి పంపడమో చేస్తుండటంతో అసలు శాసన మండలిని రద్దుచేస్తే ఎలావుంటుంది అని ముఖ్యమంత్రి జగన్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఒకవేళ మండలిని రద్దు చేయాలంటే ఒక్కరోజులో అయ్యేపనికాదు. శాసన సభ లో తీర్మానం ఆమోదించి, తరువాత పార్లమెంటు కు పంపి ఆమోదింప చేసుకోవాలి. ఇప్పటికే మోడీతో సన్నిహితంగా వున్నప్పటికీ కొన్ని విషయాలలో కేంద్రం ఇరుకున పడే నిర్ణయాల తీసుకుంటంతో బిజెపి పెద్దలు ఆగ్రహం తో ఉన్నారు. ఈ క్రమంలో ఈ మండలి రద్దు బిల్లు విషయంలో కేంద్రం ఎంతవరకు సహకరిస్తుందన్నది ప్రశ్న.
అసలు శాసన మండలి ఏర్పాటుపై మొదట్నుంచి ఏకాభిప్రాయం లేదు. ఇది కేవలం ఓ రాజకీయ పునరావాస కేంద్రంగానే ఉపయోగపడుతుందని సామాన్య ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa