నిర్భయ కేసు పరిణామాలు చూస్తుంటే నిర్భయ దోషులు, దోషులు తరుపున వాదించే లాయర్లు వీలైనంత వరకు ఉరిశిక్ష పడకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే దోషులకు విధించిన ఉరిశిక్షపై వేసిన డెత్ వారెంట్లపై పాటియాలా హౌస్ కోర్ట్ జనవరి 7న విచారించనుంది. అయితే ఆ విచారణకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసి, ఆపై క్షమాభిక్ష కోరుతూ ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ ను కోరేందుకు లాయర్లు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.
కాగా తాను నిర్భయ గ్యాంగ్ రేప్ జరిగే సమయానికి తన క్లైంట్ మైనర్ నని, ఉరిశిక్ష నుంచి తనని తప్పించాలని కోర్ట్ లో ఆతని తరపు లాయర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్ట్ జనవరి 24కి వాయిదా వేసింది. దీంతో కోర్ట్ వాయిదా వేయడంపై పవన్ గుప్తా లాయర్ ఏకే సింగ్ కోర్ట్ లో హంగామా సృష్టించాడు. కేసు విచారణలో ఆలస్యం చేస్తే తనకు న్యాయ వ్యవస్థమీద నమ్మకం పోతుందన్నాడు. ఇప్పటికే తన క్లయింట్ ఏడేళ్లు జైలుశిక్షను అనుభవించినట్లు, ఇప్పుడే తమకు న్యాయం చేయాలని మళ్లీ రివ్యూ పిటిషన్ వేశాడు ఏకే సింగ్. దీంతో దిగొచ్చిన ఢిల్లీ హైకోర్ట్ వాయిదా ఆర్డర్ ను రికాల్ చేసి విచారణ చేపట్టింది.
మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాల్ని, వ్యవస్థల్ని మారాల్సిన అవసరం ఉందని, లేదంటే జువైనల్ యాక్ట్ ప్రకారం శిక్ష పడే లోపు తాము మైనర్ అని నిరూపించుకునే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిన కోర్టు . జువైనల్ యాక్ట్ లో ఉన్న చిన్న చిన్న చట్టంలోని లొసుగుల్ని అడ్డం పెటుకొని కోర్ట్ సమయాన్నివృదా చేస్తూ దోషుల్ని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని, పవన్ గుప్తా తరపు న్యాయవాది అతి తెలివిని ప్రదర్శిస్తు ఉరిశిక్ష నుంచి తన క్లయింట్ని తప్పించుకు నేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు కనిపిస్తోందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్ లాయర్ ఏకే సింగ్ కు 25వేల రూపాయల జరిమానా విధించింది. ఏకే సింగ్ పై చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ కు ఆదేశాలు జారీ చేసింది. నిర్భయ కేసులో దోషి అయిన పవన్ గుప్తా తను మైనర్ నని, ఉరిశిక్ష నుంచి తప్పించాలని కోరుతూ కోర్ట్ లో దాఖలు చేసిన పిటిషన్ ను కోర్ట్ డిస్మిస్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa