రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందే విధంగా అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని.. విశాఖ, అమరావతిలో హైకోర్టు బెంచ్లు, వేసవిలో విశాఖలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేలా ఏర్పాటు చేయాలని సూచించినట్లు రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణంపై ఏర్పాటైన నిపుణులతో కూడిన జీఎన్ రావు కమిటీ ప్రకటించింది. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష, భౌగోళిక పరిస్థితులతో పాటు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు కమిటీ వెల్లడించింది.
ఈమేరకు సిఎం జగన్ని కలసి నివేదిక అందించిన అనంతరం కమిటీకి నేతృత్వం వహించిన జీఎన్ రావు రాష్ట్ర అభివృద్ధితో పాటు, రాజధాని నిర్మాణం గురించి కూడా నివేదిక రూపొందించామని వెల్లడించారు. 13 జిల్లాల్లో 10,600 కి.మీ తిరిగామని, అన్ని చోట్ల అధికారులు, పాత్రికేయులతో పాటు, వివిధ వర్గాల వారికి కలిశామని మూడు నెలలకు పైగా పర్యటించి నివేదిక రూపొందించామని, పలు సిఫార్సులు చేశామని ఆయన చెప్పారు
రాష్ట్రంలో వెనకబడిన ఉత్తర కోస్తాతో పాటు, రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే విధంగా పలు సూచనలు చేశాము, ఆ దిశలో రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ ఉండాలని సూచించామని వివరించారు. ‘అందులో భాగంగా అమరావతి, మంగళగిరి కాంప్లెక్స్లో హైకోర్టు బెంచ్, ఇప్పుడున్నట్లు గానే లెజిస్లేటివ్ అసెంబ్లీ, మంత్రుల నివాసాలు, గవర్నర్ క్వార్టర్ కూడా ఉండాలి.ఈ ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన ఎన్నో భూములు ఉన్నాయి. కాబట్టి వేరుగా భూసేకరణ కాకుండా నాగార్జున వర్సిటీ, ఎపీఎస్పీ బెటాలియన్కు చెందిన భూములు ఉన్నాయి. వాటిలో శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టవచ్చని సూచించినట్టు చెప్పారు. .
‘విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్లో హైకోర్టు బెంచ్, వేసవిలో సమావేశాలు నిర్వహించేలా అసెంబ్లీ బిల్డింగ్, సచివాలయంతో పాటు, సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండాలని, ‘శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టుతో పాటు, అనుబంధ కోర్టులు ఏర్పాటు చేయాా ల్సిన అవసరాన్ని తెలిపినట్టు జిఎన్రావు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa