కూటమి పాలనంతా అక్రమ కేసులు, అక్రమ నిబంధనలతో నిండిపోయిందని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై 16 అక్రమ కేసులు పెట్టి దుష్ట సంప్రదాయాన్ని ప్రారంభించారని ఆరోపించారు. తనపై పెట్టిన కేసులపై సీబీఐ విచారణ జరపాలంటూ గోవర్ధన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం ఆయన ధైర్యానికి నిదర్శనమన్నారు.చంద్రబాబు ప్రభుత్వం ప్రమేయం లేని కేసుల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ముద్దాయిలుగా చిత్రీకరిస్తూ, ఒక కేసులోని ముద్దాయిలనే తాము సృష్టించిన మరో అక్రమ కేసులో సాక్ష్యాలుగా కోర్టుల ముందు ప్రవేశపెడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు రాచరిక పాలనను అవలంబిస్తూ మోనార్క్లా వ్యవహరిస్తున్నాడన్నారు. ఎన్ని దొంగ కేసులు పెట్టి, ఎన్నిసార్లు జైళ్లకు పంపినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగి వచ్చి మరింత ఉత్సాహంతో చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తారని స్పష్టం చేశారు. జగన్ 2.0 పాలనలో అక్రమాలు, కక్షసాధింపులకు పాల్పడేవారు భయపడే పరిస్థితి తప్పక ఏర్పడుతుందని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa