వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, పార్టీ శ్రేణులు పండుగలా జరుపుకున్నారని, ఆయనకు వచ్చిన ప్రజాదరణ చూసి కూటమి నేతలు కడుపు మంటతో రగిలిపోతున్నారని వైయస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. మళ్లీ వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే భయంతో మా పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభిమాన నాయకుడిపై ఒక్కొక్కరు ఒక విధగా అభిమానం చూపుతుంటారని, జగనన్న పుట్టిన రోజు సందర్భంగా జంతు బలి చేస్తే తప్పైందా అని ప్రశ్నించారు. బాలకృష్ణ సినిమా రిలీజ్ సమయంలో జంతు బలి ఇవ్వలేదా, పవన్ కళ్యాణి సినిమా ఫ్రీ రిలీజ్ పంక్షన్లో కత్తులు ఊపించలేదా..?. అప్పుడేందుకు ఈ హోం మంత్రి మాట్లాడలేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, వైయస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక వీరికి తప్పకుండా రిటర్న్ గిప్ట్ ఇస్తామని వరుదు కళ్యాణి హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa