మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కొత్త చైర్మన్ కోసం వేట మొదలు పెట్టింది. ప్రస్తుతం కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్న ఆనంద్ మహీంద్రా(64) తో సహా టాప్ మేనేజ్మెంట్లో మార్పులు చేపట్టనున్నారు. 2020 ఏప్రిల్ 1 నుంచి ఆనంద్ మహీంద్రా కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. దీని అర్థం బోర్డులో చురుగ్గా ఉండడానికి బదులుగా, ఆయన గైడ్ పాత్రలో ఉం టారు. కంపెనీ గవర్నెన్స్, నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ (జిఎన్ఆర్సి) సిఫారసులపై ఈ మార్పును డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. బోర్డు ఇతర మార్పులు కూడా చేసింది. కంపెనీ ఎండి పవన్ కుమార్ గోయెంకా ఏప్రిల్ 1 నుండి ఎండి-, అలాగే సిఇఒగా బా ధ్యతలు చేపట్టనున్నారు. ఆయన పదవీకాలం 2020 నవంబర్ 11వరకు ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ 12 నుండి 2021 ఏప్రిల్ 1 వరకు కొత్త నియామకం ఉంటుంది. వచ్చే 15 నెలల్లో చాలా మంది అధికారులు పదవీ విరమణ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అందువల్ల స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మార్గదర్శకాల ప్రకారం కంపెనీ మార్పులు చేపట్టింది. గ్రూప్ ప్రెసిడెంట్ (స్ట్రాటజీ) అనీష్ షా 2020 ఏప్రిల్ 1 నుండి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్ఒ) పదవిని చేపట్టనున్నారు. ఒక సంవత్సరం తరువాత 2021 ఏప్రిల్ 2న ఆయన ఎండి, సిఇఒ అవుతారు. ఈ పదవిలో ఆయన పదవీకాలం 2025 మార్చి 31వరకు ఉంటుంది. ప్రస్తుత సిఎఫ్ఓ విఎస్ పార్థసారథి ఏప్రిల్ 1న పదవీవిరమణ చేయనున్నారు. మొబిలిటీ సర్వీసెస్ రంగానికి ఆయన నాయకత్వం వహించనున్నారు. మొబిలిటీ సర్వీసెస్ రంగాన్ని సృష్టించడానికి మహీంద్రా లాజిస్టిక్స్, ఆటో మొబిలిటీ సర్వీసెస్ మెర్జ్ కానున్నాయి. నాయకత్వ మార్పుకు ప్రణాళికలు ప్రకటించడం సంతోషంగా ఉందని ఆనంద్ మహీం ద్రా అన్నారు. ఇది సుపరిపాలన పట్ల నిబద్ధతను చూపుతుంది. ప్రణాళికను రూపొందించడానికి ఒక సంవత్సరం పాటు కృషి చేసిన బోర్డు, నామినేషన్ కమిటీకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa