వైసీపీ ప్రాంతాల మద్య చిచ్చు పెడుతు, రాజకీయ లబ్ది పొందాలనే ఏపీ సీఎం జగన్ మూడు రాజధానులను తెరమీదకు తెచ్చారని మాజీ మంత్రి అఖిలప్రియ ఆరోపించారు. శనివారం ఆమె తన నివాసంలో మీడియాలో మాట్లాడుతూ జగన్ తనకు అనుకూలంగా రిపోర్టు ఇప్పించుకునేందుకే జీఎన్.రావు కమిటీని వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
రాయలసీమ నుంచి విశాఖకు రోడ్ కనెక్టివిటీ లేదన్న విషయాన్ని జగన్ ఎందుకు పరిగణలోనికి తీసుకోలేదని అఖిలప్రియ ప్రశ్నించారు. రాయలసీమ లోని సామాన్యులు సచివాలయ పనులకు విశాఖకు వెళ్లే పరిస్థితి ఎక్కడుంటుందని మండిపడ్డారు. విశాఖ అన్ని విధాలుగా అనుకూలమంటున్న జిఎస్రావు కమిటీ పెద్దలు హుద్ హుద్ తుఫాన్ కు అతలా కుతలమైన విషయాన్ని ఎందుకు గమనించలేదని నిలదీసారు. ప్రభుత్వ తీరు కారణంగా రాష్ట్రంలో నిప్పురాజేసిన విషయాన్ని గమనించాలని యువతకు పిలుపునిచ్చారు. ఇదే తీరుగా ముందుకు పోతే జనం తిరగబడతారని, ప్రభుత్వానికి ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగలడం ఖాయమని అఖిలప్రియ హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa