ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ కీలక నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Sun, Dec 22, 2019, 10:25 AM

పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతునే ఉన్నాయి. సీఏఏపై వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు ఈ చట్టంపై ప్రజల్లో నెలకొన్న అపోహలను నివృత్తి చేసేందుకు బీజేపీ నడుంబిగించింది. దేశవ్యాప్తంగా వెయ్యి ర్యాలీలు, 250 మీడియా సమావేశాలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ ర్యాలీల ద్వారా సీఏఏపై ప్రజల్లో నెలకొన్న అపోహలను నివృత్తి చేస్తామని, ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను దూరం చేస్తామని బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేందర్ తెలిపారు. సీఏఏపై కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa