ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ మరో కీలక నిర్ణయం?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 22, 2019, 10:16 AM

ఏపీ సీఎం జగన్ మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో ఇళ్లు లేని వారు ఉండవద్దని ఇటీవల ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి పేదలకు ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా ఆయన మంచి పేరు సంపాదించారు. అయితే సీఎం జగన్ కూడా పేదలందరికి ఇండ్లు కట్టించే యోచనలో ఉన్నారు. సింగిల్ గా కాకుండా బహుళ అంతస్థుల నిర్మాణం చేసి ఎక్కువ మంది పేదలకు లబ్ధి జరిగేలా ఆయన ఆలోచిస్తున్నారని సమాచారం. మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వం ముంబైలో జీ+10 విధానంలో బహుళ అంతస్థులను నిర్మించి పేదలకు ఇస్తోంది. ఇదే విధానంలో ఏపీలో కూడా జీ+10 వరకు బహుళ అంతస్థులు నిర్మించి పేదలకు ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక ఎకరం స్థలంలో జీ+10 కడితే దాదాపు మూడు వందల పేద కుటుంబాలకు ఇవ్వవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న భూ కొరతతో ప్రతి ఒక్కరికి సింగిల్ గా ఇండ్లు కట్టి ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. అందుకే ఒక ఎకరం స్థలంలో 300 మందికి ఇండ్లు ఇచ్చేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే మహారాష్ట్రకు ఏపీ అధికారులు వెళ్లి అక్కడ ఇండ్ల పంపిణీ విధానం పై అధ్యయనం చేసి సర్కార్ కు నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం ఏపీలో కూడా అదే విధానాన్ని అమలు చేయనున్నారని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa