ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్‌ ఎంపీ అరెస్ట్‌ వారెంట్‌ !

national |  Suryaa Desk  | Published : Sun, Dec 22, 2019, 04:30 PM

కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌కు స్థానిక కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ఆయన రాసిన ‘ద గ్రేట్‌ ఇండియన్‌ నావెల్‌’ అనే పుస్తకంలో హిందూ మహిళలను అవమానపరిచాడని దాఖలైన కేసులో ఆయనకు ఈ  వారెంట్‌ జారీ చేయబడింది. వారెంట్‌లో తన వాదనను వినిపించడానికి శశిథరూర్‌ గానీ, లేదా ఆయన లాయర్‌గానీ కోర్టు వాయిదాలకు హాజరు కాలేదని, అందుకోసం అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేస్తున్నట్టు తెలపబడింది. ఈ విషయంపై శశిథరూర్‌ అఫీస్‌ వర్గాలు వివరణనిస్తూ.. ‘వారెంట్‌ జారీ అయినట్టు మాకు మీడియా ద్వారానే తెలిసింది. అధికారికంగా మాకు ఎలాంటి సమాచారం రాలేదు. ఇంతకుముందు కోర్టుకు హాజరుకావాలని సమన్లు వచ్చాయి. అయితే అందులో ఏ తేదీన  హాజరు కావాలో లేనందున ఆ విషయాన్ని మేం కోర్టు దృష్టికి తీసుకెళ్లాం. దీంత కోర్టు వారు తేదీతో సహా పేర్కొని మరోసారి నోటీసు జారీ చేస్తామన్నారు. దాని ఆధారంగా మా తదుపరి కార్యాచరణ ఉంటుంద’ని ఆఫీస్‌ వర్గాలు తెలిపాయి. ఈ పుస్తకం మొదటి ప్రచురణ 1989లో జరిగింది. కాగా, శశిథరూర్‌కు ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన విషయం తెలసిందే






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa