అమరావతి నుంచి రాజధానిని తరలింపుపై రైతులకు మద్దతుగా తాడేపల్లి టిడిపి నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఆదివారంఉదయం ఉండవల్లి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా నిర్వహించారు, రాజధానిపై విపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడుతున్న జగన్ ఓ సారి తన మాటలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేతలు సూచించారు.
సేవ్ అమరావతి నినాదంతో ఉండవల్లి హోరెత్తింది. మూడు రాజధానులపై వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలని, రాజధానుల వికేంద్రీ కరణ పేరుతో రాష్ట్రానికి కొత్త భారాన్ని వేసి, మరింత దిగజార్చేలా వైసిపి ప్రభత్వం చేస్తోందని విమర్శించారు.
కేవలం రాజకీయ ప్రయోజనాలకోసం, సొంత పార్టీ నేతల భూములకు రేట్లు దక్కించేందుకే మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చిన జగన్, దానిని ఉపసంహరించుకోకుంటే మరిన్ని ఉద్యమాలు పుట్టుకురావటం ఖాయమన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటి జగన్ చెప్పిన చిలక పలుకులనే వల్లించిందని తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు జంగాల సాంబశివరావు విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, తదితర నాయకులు, రైతులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa