అమరావతిపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిని రాజస్థాన్ ఎడారితో పోల్చారు. అమరావతికి వెళ్లాలంటే రాజస్థాన్ ఎడారిలోకి వెళ్లినట్లుగా ఉంటుందని తన మనసులోని అభిప్రాయాన్ని బయటపెట్టారు. అయినా రాజధాని అంటే... ప్రతీ ఒక్కరూ నాది అన్న ఫీలంగా ఉండాలన్నారు. కానీ అమరావతిలో మాత్రం తనకెప్పుడూ అలా అనిపించలేదని చెప్పుకొచ్చారు.
అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ 3 రాజధానులు ఉండొచ్చేమోనన్న ప్రకటనను ప్రజలు స్వాగతించారని తెలిపారు. విమర్శలు చేసే వారంతా వాస్తవాలను తెలుసుకోవాలని హితవు పలికారు. ఇన్సైడ్ ట్రేడింగ్ ఆరోపణలపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని స్పీకర్ డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa