వెస్టిండీస్తో ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ని అందుకున్నాడు. మ్యాచ్లో 63 బంతుల్లో 8x4, 1x6 సాయంతో 63 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఒక ఏడాదిలో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్గా నిలిచాడు. కటక్ వన్డేకి ముందు 2,379 పరుగులతో ఉన్న రోహిత్ శర్మ.. తాజాగా 2,442 పరుగులతో నిలిచాడు. దీంతో.. సనత్ జయసూర్య 22 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డ్ కనుమరుగైంది. శ్రీలంక దిగ్గజ ఓపెనర్ సనత్ జయసూర్య 1997లో అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 2,387 పరుగులు చేయగా.. అప్పటి నుంచి ఈ రికార్డ్కి ఏ క్రికెటర్ కూడా చేరువ కాలేకపోయాడు. కానీ.. ఈ ఏడాది కెరీర్లోనే బెస్ట్ ఫామ్లో కొనసాగుతున్న రోహిత్ శర్మ ఆ రికార్డ్ని బ్రేక్ చేసేశాడు. విశాఖపట్నం వేదికగా గత బుధవారం వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ (159: 138 బంతుల్లో 17x4, 5x6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa