స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఏపీ భవన్లో అవమానం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర అతిథిగా తనకు గౌరవ, మర్యాదలు ఇవ్వలేదని తమ్మినేని మనస్తాపం చెందారు. కుటుంబంతో డెహ్రాడూన్ నుంచి శనివారం ఢిల్లీ చేరుకున్న స్పీకర్ ఏపీ భవన్లో బస చేసారు. ఆయనకు స్వర్ణముఖి బ్లాక్ లోని 320 గెస్ట్ రూమ్ ను కేటాయించారు. ఆదివారం రాష్ట్రానికి బయల్థేరేందుకు తమ్మినేని కుటుంబం సిద్దమైంది. ఇంతలో ఏపీ భవన్ ఉద్యోగి వచ్చి భోజనం, వసతి బిల్లు కట్టమనడంతో స్పీకర్ షాక్ గురుయ్యారు.
రాష్ట్ర అతిథి హోదాలో ఉన్న తనను బిల్లు అడగడమేంటని విస్తుపోయారు. అయితే తమ్మినేని సీతారాంకు స్టేట్ గెస్ట్ గా కాకుండా కేటగిరీ-1 కింద విడిది ఇవ్వాలని ఏపీ జీఏడీ అధికారులు ఆదేశాలే కారణమని తెలిసింది. అవమానం జరిగిందని ఈ ఘటనపై స్పీకర్ భార్య వాణి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. ముందు బిల్లు కట్టేయేమని తన సిబ్బందికి తమ్మినేని ఆదేశించారు. అయితే ఈ సంఘటనపై ఏపీ భవన్ రెసిడెంట్ కమీషనర్ విచారం వ్యక్తం చేసారు. బిల్లు వసూలు చేయడం తప్పేనని జరిగిన పోరపాటుకు చింతిస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa