ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పౌరసత్వ చట్టం ఏ వర్గానికి, మతానికి వ్యతిరేకం కాదు: నాదెండ్ల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 23, 2019, 06:52 PM

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నాదెండ్ల భాస్కరరావు విమర్శించారు. ఈ చట్టం గురించి ఈశాన్య రాష్ట్రాల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. పౌరసత్వ చట్టం ఏ వర్గానికి, మతానికి వ్యతిరేకం కాదని చెప్పారు.
దేశం నుంచి ముస్లింలను వెళ్లగొట్టమని ఎవరూ చెప్పడం లేదని అన్నారు. ఈ చట్టంపై లోక్ సభలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన ప్రసంగం అభ్యంతరకరంగా ఉందని అన్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ చట్టంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని నాదెండ్ల మండిపడ్డారు. అల్లర్లు చేయడం దేశంలో కొందరికి ఒక అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa