ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఢిల్లీలో అవమానం జరిగింది. ఢిల్లీ భవన్లో ప్రోటాకాల్ పాటించకుండా.. కనీస మర్యాదలు లేకుండా చేశారనే విమర్శలొచ్చాయి. ఏపీ భవన్లో ఎదురైన అవమానంతో స్పీకర్ కూడా మనస్తాపం చెందారని తెలుస్తోంది. ఓ పర్యటన నిమిత్తం స్పీకర్ తమ్మినేని సతీసమేతంగా డెహ్రాడూన్ వెళ్లి తిరిగి ఢిల్లీ చేరుకున్నారు.. ఏపీ భవన్లో బస చేశారు. తమ్మినేనికి ఏపీ భవన్లోని స్వర్ణముఖి బ్లాకులో గెస్ట్ రూమ్ను కేటాయించారట. అక్కడి నుంచి తిరిగి ఏపీకి బయల్దేరే సమయంలో ఏపీ భవన్ ఉద్యోగి ఒకరు భోజనం, వసతికి సంబంధించి బిల్లు కట్టాలని.. ఓ బుక్లో సంతకం చేయాలని అడిగారట. అతిథి హోదాలో వచ్చిన తనను బిల్లు కట్టమని అడగటంతో స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారట. అక్కడి సిబ్బంది తీరుతో కాస్త మనస్తాపానికి గురయ్యారట. స్పీకర్ అసలు విషయం ఏంటని అక్కడి సిబ్బందిని ఆరా తీస్తే.. కేటరిగీ 1 కింద విడిది ఏర్పాటు చేశామని.. అమరావతిలో ఉండే జీఏడీ నుంచి స్టేట్ గెస్ట్గా కాకుండా కేటగిరీ-1లో వసతి కల్పించాలని ఆదేశాలిచ్చారని చెప్పుకొచ్చాటర. అందుకే పొరపాటు జరిగిందన్నారట. దీంతో స్పందించిన స్పీకర్.. బిల్లు కట్టేయమని తన సిబ్బందిని ఆదేశించారట. ఈ వ్యవహారంపై స్పీకర్ సతీమణి కూడా కాస్త అసహనానికి గురయ్యారట. స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తికి అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారట. డబ్బు ఎంతైనా ఇచ్చేద్దాం అంటూ సీతారాంతో అన్నారట. తర్వాత అధికారులు తప్పును గ్రహించినట్లు తెలుస్తోంది. స్టేట్ గెస్ట్గా వచ్చినవారి నుంచి బిల్లలు వసూలు చేయడం తప్పే అన్నారట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa