శాంతి సందేశం ఇవ్వడమే క్రిస్మస్ పండుగ ఉద్దేశమని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరినిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. సమస్యలు లేని ఆనందకర జీవితం ఇవ్వడమే ఏసుక్రీస్తు బోధనల సారాంశమని చెప్పారు. మనిషిగా పుట్టి మనలాగే సమస్యలను ఎదుర్కొని ప్రేమ సందేశాన్ని ఇచ్చారన్నారు. ఏసు మార్గంలో క్రిస్టియన్ మిషనరీలు సేవాభావంతో తరిస్తున్నాయని కొనియాడారు. క్రిస్మస్తో పాటు రంజాన్, సంక్రాంతి పండుగలకు కానుకలిచ్చిన విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు. తమ ప్రభుత్వ హయాంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడే ఈ వేడుకలకు నాంది పలికామని చంద్రబాబు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa