ప్రజలతో అనునిత్యం మమేకమయి, వారి కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ సాదాసీదా జీవితం గడిపే ఎమ్మెల్యేగా పేరున్నఆళ్ల రామకృష్ణారెడ్డి రాజధాని తరలింపు చర్చలో ఎక్కడా నోరు విప్పకపోవటంపై ఆ ప్రాంతవాసులలో చర్చ జరుగుతోంది. అందునా రాజధాని ప్రాంతంలో కీలకమైన మంగళగిరి నియోజకవర్నానికి ప్రాతినిధ్యం వహిస్తున్నఆయన రాజధాని తరలింపు అంశాన్ని స్వాగతిస్తున్నట్లు గానీ, వ్యతిరేకిస్తున్నట్లుగానీ చెప్పకుండా మౌనం పాటించటం పైన ఆ ప్రాంత వాసులలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం రాజధాని కోసమంటూ పేదల నుంచి భూములు బలవంతంగా లాక్కొందంటూ వారి పక్షాన న్యాయస్థానాన్నిఆశ్రయించడం, వేల ఎకరాల్లో భూములు బాబు బినామీలు కొన్నారంటూ ఆరోపించడంతోపాటు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఎప్పటికప్పుడు మీడియా ముందు పెట్టి సంచలనం సృష్టించిన ఆర్కే. ప్రస్తుతం ఆయన మౌనం అంగీకారంగానే భావించాల్సి వస్తుందన్నవాదన వినిపిస్తొంది.
తన నియోజకవర్గంలోనే ఉన్నరాజధాని నగరాన్ని, విశాఖకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాకిమ్మనకపోవటం వెనుక ఆంతర్యమేంటన్నచర్చజరుగుతోంది. జగన్కు అత్యంత సన్నిహితుడైన ఆర్కేవంటి ఎమ్మెల్యేల పరిస్థితే అంత ఇరకాటంగా ఉంటే, ఇక సాధారణ ఎమ్మెల్యేల సంగతెలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చని సామాజిక మీడియాలో కథనాలు ట్రోల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa