రాజధాని వ్యవహరం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిన వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం తుళ్లూరులో పర్యటించారు. ఏపీకి మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ధర్నాలో బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిరూపించడం కోసం జగన్.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతారా? అని సవాల్ విసిరారు. అమరావతి ఓ మహానగరం అవుతుందని భావించానని, చర్రితలో నిలిచిపోతుందని అనుకున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే.. రైతులు 33 వేల ఎకరాల భూములను రాజధాని కోసం ఇచ్చారన్నారు. రైతులకు అన్యాయం జరగొద్దనే ఉద్దేశంతోనే ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీ ప్రకటించామన్నారు. నాడు సీఎం హోదాలో తాను హామీ ఇస్తే.. ఇప్పుడు జగన్ సర్కారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ, హైకోర్టు మాత్రమే అమరావతి ఉంటే అభివృద్ధి చెందదన్న బాబు.. అమరావతిపై వచ్చింది జీఎన్ రావు కమిటీ రిపోర్టు కాదు... జగన్ నివేదిక అంటూ విమర్శలు గుప్పించారు. రూపాయి ఖర్చు లేకుండా రాజధాని నిర్మాణాన్ని తాను ప్రారంభించానని టీడీపీ అధినేత తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa