ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం మరో కీలక నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Tue, Dec 24, 2019, 03:46 PM

దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టంతో పాటు ఎన్ఆర్సీపై ఆందోళనలు కోనసాగుతున్నప్పటికి కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ చట్టానికి సంబంధించి మరో కీలక నిర్ణయానికి మోడీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 2020 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో అసోం మినహాయిస్తే మిగతా రాష్ట్రాల్లో జాతీయ జనాభా పట్టిక రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఇందు కోసం 8700కోట్లను మోడీ ప్రభుత్వం కేటాయించింది. జాతీయ జనాభా పట్టిక తయారైన తర్వాత ఎన్ఆర్సీని రూపొందించనుంది. దేశ వ్యాప్తంగా నిజమైన పౌరుల వివరాలు సేకరించడమే జాతీయ జనాభా పట్టిక లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ జనాభా పట్టిక ద్వారా అందరి వేలిముద్రలు సేకరించిన తర్వాత పౌరసత్వ గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa