దేశంలో ఎన్ని చట్టాలు చేసినా, కఠిన శిక్షలు విధిస్తున్న మహిళలపై అత్యాచారాలు, దాడులు ఆగటం లేదు. ఆర్ధిక రాజధాని ముబయిలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై నలుగురు దుండగులు యాసిడ్ పోసిన ఘనట జరిగింది. అది గతంలో ఆమె చదివిన పాఠశాల ప్రిన్సిపాల్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు బాధితురాలు చెపుతోంది.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం కాంజూర్మార్గ్లో దక్షిణ ముంబయికి చెందిన బాధిత బాలిక మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో దుండగులు ఆమెపై యాసిడ్ చల్లి పారిపోయారు. గతంలో చదువుకున్న స్కూల్ ప్రిన్సిపాల్ సహా నలుగురు వ్యక్తులు కాలనీ గేట్ వద్ద నిలబడి ఉండటాన్ని చూశానని, తను నడుచుకుని వెళ్తుండగా ముగ్గురు నన్ను పట్టుకోగా.. ప్రిన్సిపాల్ నాపై యాసిడ్ పోశాడని ఛాతీ, కాళ్లపై గాయాలయిన బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పోలీసులకు వివరించింది. తనపై జరిగిన దాడిని తన తల్లికి ఫోన్ చేసి చెప్పానని , దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తనకు స్వల్ప గాయాలే కావడంతో ఆసుప్రతిలో ట్రీట్మెంట్ తదుపరి పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు అందించినట్టు పోలీసులు చెప్పారు.
మహిమ్లోని ఓ కాలేజీలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదువుతోన్న బాధితురాలు తను పదో తరగతి చదువుతున్న టైమ్లో ఎలాంటి తప్పు చేయకుండా ఓ టీచర్ శిక్షించినందుకు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిందని, దీనిపై కేసును వెనక్కి తీసుకోవాలని గత కొద్ది రోజులుగా స్కూల్ యాజమాన్యం బాదితురాలపై వత్తిడి తెస్తోందని, అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఈ యాసిడ్ దాడి చేశారని బాధితురాలు చెబుతున్న కోణంలో దర్యాప్తు ఆరంభించినట్టు పోలీసులు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa