ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రజలకు శుభవార్త.. నేటి నుంచే అమలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 26, 2020, 01:15 PM

ఏపీ గ్రామ సచివాలయాల్లో నేటి నుంచి 536 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే సచివాలయాల్లో ప్రజలకు సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక నుంచి దాదాపు 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో నేటి నుంచి అన్ని సేవలు ప్రారంభం కానున్నాయి. ఇక నుంచి ప్రజలు తమకు కావాల్సిన పనుల కోసం ఆఫీసుల చుట్టూ, మీ సేవల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా గ్రామం నుంచే అన్ని సదుపాయాలు పొందవచ్చు.


- పొలం పాస్‌బుక్‌లో భూముల వివరాలు నమోదు, ఈసీల జారీ


- కుల ధృవీకరణ పత్రాలు.


- రేషన్‌కార్డులో మార్పుచేర్పులు.


- దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్‌


- 15 నిమిషాల వ్యవధిలోనే 1 బి, అడంగల్, ఆధార్, రేషన్‌కార్డు ప్రింట్, టైటిల్‌డీడ్, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ సరిఫికెట్‌ కాపీ, విద్యుత్‌ కనెక్షన్‌ కేటగిరి మార్పు లాంటి సేవలు పొందవచ్చు.


- అప్పటికప్పుడు మొత్తం 47 రకాల సేవలను అందిస్తుండగా మరో 148 రకాల సేవలను కేవలం మూడు రోజుల వ్యవధిలోనే పరిష్కరిస్తారు.


గ్రామ,వార్డు సచివాలయాల్లో నిత్యం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ఎక్కడ కూడా పనులు పెండింగ్ ఉండకుండా చూస్తారు. అన్ని సేవలను కూడా వెంటనే అయిపోయేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. వివిధ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు ఇంటి వద్దే అందచేసేందుకు ప్రభుత్వం నియమించిన 2.81 లక్షల మంది వాలంటీర్లకు మొబైల్‌ ఫోన్లు, సిమ్‌కార్డులను ఇప్పటికే పంపిణీ చేశారు.


సచివాలయాల్లో వందల సంఖ్యలో సేవలను అందుబాటులోకి తెస్తుండటంతో ప్రతి చోట కంప్యూటర్లు, ప్రింటర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించారు. ప్రింట్‌ తీసిన అనంతరం దరఖాస్తుదారులకు లామినేషన్‌ చేసిన కార్డులను అందచేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa