నిర్భయ కేసులో దోషుల దొంగ నాటకాలు కంటిన్యూ అవుతున్నాయి. ఉరిశిక్ష అమలును ఆలస్యం చేసేందుకు నలుగురు హంతకులు విడతల వారీగా డ్రామాలు ఆడుతున్నారు. ముఖేష్సింగ్ పిటిషన్ను సుప్రీంకోర్ట్ కొట్టేసిన రోజే... మరో దోషి వినయ్శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. దీంతో ఫిబ్రవరి ఒకటిన ఉరి అమలుకావడం డౌటే అంటున్నారు న్యాయ నిపుణులు.నిర్భయ దోషుల ఉరితీత తేదీ సమీపిస్తున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. తనకు విధించిన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ విజ్ఞప్తి చేశాడు. ఈ కేసులో దోషి అయిన ముఖేష్ సింగ్ ఇప్పటికే రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరగా.. ఆయన తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 32 కింద క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణపై న్యాయ విచారణ చేయాల్సిందిగా ముఖేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సర్వోన్నత న్యాయస్థానం అతడి పిటిషన్ను నిన్న కొట్టివేసింది. ఈ నేపథ్యంలో వినయ్ శర్మ రాష్ట్రపతి క్షమాభిక్ష కోరడంతో ఉరిశిక్ష అమలు తేదీ మరోసారి పొడిగిస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి.
కాగా ఏడేళ్ల క్రితం దేశ రాజధానిలో చోటుచేసుకున్న నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులు ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ ఠాకూర్కు దాదాపు రెండున్నరేళ్ల క్రితమే సుప్రీంకోర్టు మరణ శిక్ష ఖరారు చేశారు. ఈ క్రమంలో నిర్భయ దోషులను జనవరి 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసింది.
అయితే ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు చివరి ప్రయత్నంగా వినయ్ శర్మ, ముఖేష్ కుమార్ సర్వోన్నత న్యాయస్థానంలో క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు వీటిని కొట్టివేయడంతో ఇక ఉరి అమలు జరగడమే తరువాయి అని అంతా భావించారు. కానీ ముఖేష్ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకున్నాడు. అయితే అక్కడ కూడా అతడికి నిరాశే ఎదురైంది. ముఖేష్ అభ్యర్థనను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa