మహారాష్ట్రలో మరోసారి లాక్డౌన్ను విధించబోమని సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. అయితే ప్రజలు భౌతిక దూరంతోపాటు ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం శుక్రవారం ట్వీట్ చేసింది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరుతుండటంతో రాష్ట్రంలో మరోసారి పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధిస్తారంటూ ఇటీవల వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే దీనిపై స్పష్టత ఇచ్చారు. సడలించిన లాక్డౌన్ను తిరిగి పునరుద్ధరింబోమని చెప్పారు. అయితే ప్రజలంతా భౌతిక దూరంతోపాటు కరోనా వ్యాప్తి నియంత్రణ మార్గదర్శకాలను పాటించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa