ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాలిస్తున్న తల్లిపై అత్యాచారయత్నం!

national |  Suryaa Desk  | Published : Sat, Aug 29, 2020, 05:05 PM

ఏడాది బిడ్డకు చనుబాలు ఇస్తున్న మహిళపై కామంతో రగిలిపోతూ దారుణంగా వ్యవహరించిన వైనం బెంగళూరులో చోటు చేసుకుంది. పాలు తాగుతున్న పసి పిల్లాడ్ని పక్కకు నెట్టేసి మరీ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనలో నిందితుడు భార్య కూడా సహకరించింది. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరులోని సిద్దపుర ప్రాంతంలోని హోంబిగౌడ నగరికి చెందిన 24 ఏళ్ల మహిళపై అదే ప్రాంతానికి చెందిన కుమార్ కన్నేశాడు. తాజాగా తన ఏడాది బిడ్డకు పాలిస్తున్న వేళ ఆమెను చూసి కామంతో రగిలిపోయాడు. ఇంట్లో ఎవరూ లేకపోవటాన్ని గమనించి పాలు తాగుతున్న బిడ్డను పక్కకు లాగి పడేసి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.
దీంతో భయాందోళనలకు గురైన సదరు మహిళ కేకలు, అరుపులకు అక్కడకు చేరుకున్న నిందితుడి భార్య భర్తను వెనకేసుకు రావటమే కాదు అతడ్ని అక్కడి నుంచి తప్పించేసింది. బాధిత మహిళను దారుణంగా తిడుతూ భర్తను ఇంటి నుంచి బయటకు దాటించేసింది. జరిగిన దారుణంపై బాధిత మహిళ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై అత్యాచారం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తన భర్తను అదుపులోకి తీసుకున్న పోలీస్ స్టేషన్ కు వెళ్లిన నిందితుడి భార్య హడావుడి చేసింది. బీపీ ఉన్నట్లు నటిస్తూ తన భర్తపై తప్పుగా కేసు పెట్టారంటూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి తెర తీసింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి నిందితుడి భార్యకు ఎలాంటి ప్రాణాపాయం లేదు. నిందితుడ్ని పోలీసులు విచారణ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa