ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాల్వాన్ పోరులో చైనాకు భారత్ చావుదెబ్బ..సాక్ష్యమిదిగో

international |  Suryaa Desk  | Published : Sat, Aug 29, 2020, 06:33 PM

భారత్-చైనా సరిహద్దులో గాల్వాన్ లోయ వద్ధ ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన బీకర ఘర్షణలో చైనాకు ఎంత నష్టం జరిగిందనేది ఇప్పటికీ గోప్యమే. ఇప్పటి వరకు చైనా సైనికుల మరణాలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ ఘర్షణలో చైనాకు సంబంధించి 35 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారంటూ అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు స్పష్టం చేశారు. ఇకపోతే జాతీయ మీడియా అయితే 45 మంది వరకు చనిపోయారంటూ ప్రచారం చేసింది. కానీ చైనా మాత్రం నోరు మెుదపలేదు. ఈ విషయాన్ని ఇప్పట్లో బయటపెట్టదని కథనాలు కూడా వచ్చాయి. అయితే సోషల్ మీడియా మాత్రం ఏ నిజాన్ని దాచడం లేదు. ప్రపంచంలో ఏమూలన ఏది జరిగినా అది ఇట్టే మోసుకొస్తోంది సోషల్ మీడియా.చైనా ట్విట్టర్‌లో గాల్వాన్ ఘటనకు సంబంధించి తొలి ఆధారం వైరల్ అవుతోంది. ఆ ఘర్షణలో మృతి చెందిన ఓ చైనా సైనికుడి సమాధికి చెందిన చిత్రాలు వైరల్ అవుతున్నాయి. ఆ సమాధిపై ఇది చెన్ చియాంగ్రో సమాధి. భారత్‌తో గాల్వాన్‌లో జరిగిన ఘర్షణలో ఆయన ప్రాణ త్యాగం చేశారు. చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ చెన్‌ త్యాగాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది అని శిలాఫలకంపై రాసి ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ శిలాఫలకం చైనా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ చిత్రాలు భారత ట్విట్టర్‌లోనూ హల్‌చల్ చేస్తున్నాయి.అమరులైన భారత్ జవాన్లకు సకల ప్రభుత్వ లాంఛనాల మధ్య దేశ ప్రజలు తుది వీడ్కోలు పలకింది. కానీ చైనా మాత్రం అత్యంత గోప్యంగా అంత్యక్రియలు నిర్వహించింది. ఈ అంశంపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా సైతం తీవ్ర విమర్శలు చేసినప్పటికీ ప్రభుత్వం అసలు స్పందించలేదు. ఇప్పటికీ జరిగిన నష్టం తాలూకు వివరాలు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో తాజా చిత్రాలు అక్కడి రాజకీయ వాతావరణాన్ని మరోసారి వేడెక్కించాయి. ఇకపోతే ఈ బీకర ఘర్షణలో భారత్ ఆర్మీ చైనా పై సింహాల్లా గర్జించిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa