ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా అచల్ కుమార్ జ్యోతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 04, 2017, 06:50 PM

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా అచల్‌ కుమార్ జ్యోతి ఎంపికయ్యారు. కేంద్ర న్యాయశాఖ ఆయన నియామకాన్ని ఖరారు చేసింది. ఈ నెల 6 న అచల్ కుమార్‌ సీఈసీ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ఎన్నికల ప్రధానాధికారి నసీమ్ జైదీ ఈ నెల 6 న పదవీ విరమణ చేయనున్నారు.  64 ఏళ్ల అచల్‌ కుమార్‌ గుజరాత్ ఐఏఎస్‌ కేడర్‌ అధికారి. గుజరాత్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా ఆయన పనిచేశారు. 2013 లో ఆయన రిటైర్‌ అయ్యారు. ఆ తర్వాత గుజరాత్‌ విజిలెన్స్ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా అచల్ కుమార్ మూడేళ్ల పాటు అధికారంలో ఉంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa