ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి కేసు విచారణ హైకోర్టులోనే తేల్చుకోవాలన్న సుప్రీంకోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 07, 2017, 03:00 PM

ఏపీ రాజధాని అమరావతి కోసం చేపట్టిన భూ సేకరణ అంశం ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం కేసును విచారించింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. 2013 భూ సేకరణ చట్టం సరిగా అమలు కావడం లేదని మూడు పంటలు పండే భూములను నోటిఫై చేయకుండానే భూ సేకరణ చేపట్టారని తన పిటిషన్ లో ఆర్కే ఆరోపించారు. ఈ నేపథ్యంలో, కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థాయం... ఈ కేసును హైకోర్టు విచారిస్తున్న నేపథ్యంలో అక్కడకే వెళ్లాలని పిటిషనర్ కు సూచించింది. హైకోర్టు తీర్పు తర్వాత అవసరమైతే మళ్లీ తమను ఆశ్రయించవచ్చని తెలిపింది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa